నేను తెలుగులో చాలా రాశాను. పుస్తకాలు కూడా. ఇంకా రాస్తూనే ఉన్నాను. సైన్సు,సాహిత్యం, సంగీతం, కళలు నా హాబీలు.
Showing posts with label కవిత. Show all posts
Showing posts with label కవిత. Show all posts
Thursday, September 22, 2016
Sunday, December 28, 2014
బాహర్ నికాలో - మర్ జాయేగీ
పొట్లం మీద అక్షరాలు భయపెడుతున్నయ్
పొగాకు చంపుతుంది, అని
అవునూ,
పొగాకు చంపుతుందా
దానికంత దమ్ముందా
ప్రేమ చంపుతుంది
ప్రేమికురాలు చంపుతుంది
అన్నం చంపుతుంది
ఆకలి చంపుతుంది
మామూలుగా ఒక మాట చంపుతుంది
ఇక పొగాకు చంపితేనేమట
పోతే పోనీ పోరా
నాబతుకు నాచావు
అందరూ చంపే వాళ్లే
అన్నిటికన్నా ముందు నా ఆలోచనలు
ఆ తరువాతే మిగతా అన్నీ
పోతే పోనీ పోరా
Saturday, November 2, 2013
Monday, August 5, 2013
రూమీ - అస్తిత్వం
మౌలానా జలాలుద్దీన్ రూమీ ప్రసిద్ధ కవి, తాత్వికుడు.
పర్షియన్ భాషలో రాసిన ఆయన కవితలు ప్రపంచమంతటా పేరు పొందినయి.
దీవాన్ అంటే సంపూర్తి కవితాసంకలనం అని అర్థం.
రూమీ దీవాన్ లోని 238వ కనిత ఇది.
పర్షియన్ భాషలో రాసిన ఆయన కవితలు ప్రపంచమంతటా పేరు పొందినయి.
దీవాన్ అంటే సంపూర్తి కవితాసంకలనం అని అర్థం.
రూమీ దీవాన్ లోని 238వ కనిత ఇది.
ఉండుట, లేకుండుటల గురించి కాదు
నా తికమక.
రెండు ప్రపంచాల నుంచి తెగతెంపులు
చేసుకోవడం ధైర్యమనిపించుకోదు.
నాలో ఉన్న అద్భుతాలను
గుర్తించ లేకుండడం
అది
అసలయిన వెర్రితనం!
అంటాడాయన.
I neither know Persian nor English.
What I did is not translation.
I only tried to bring the idea here.
To be or not to be
is not my dilemma.
To break away from both the worlds
is not bravery.
To be unaware of the wonders
that exist in me
that
is real madness!
(Translation by Maryam Mafi & Azima Melita Kolin)
Monday, April 22, 2013
Tuesday, February 26, 2013
వరద కవిత
అబ్బూరి వరద రాజేశ్వర రావు గారితో పరిచయం కలగ లేదన్నది నాకున్న అసంతృప్తులలో ఒకటి.
అవకాశం ఉండి కూడా ఎందుకో వారిని కలవతేక పోయాను.
వారి శ్రీమతి ఛాయాదేవి గారికి మాత్రం నా పట్ల వల్లమాలిన అభిమానం ఉంది.
ఈ కవిత నాకు నచ్చింది గనుక ఇక్కడ అందరి ముందు ఉంచుతున్నాను.
అవకాశం ఉండి కూడా ఎందుకో వారిని కలవతేక పోయాను.
వారి శ్రీమతి ఛాయాదేవి గారికి మాత్రం నా పట్ల వల్లమాలిన అభిమానం ఉంది.
ఈ కవిత నాకు నచ్చింది గనుక ఇక్కడ అందరి ముందు ఉంచుతున్నాను.
వరద చాలా సరదా మనిషి అని విన్నాను.
మరి ఈ నిర్వేదం ఎందుకో తెలియదు.
Saturday, October 27, 2012
కొత్త కవిత
అలలు రాళ్లకు కొట్టుకొని అరిగి పోతున్నయి.
అలిసిన సూర్యుడు సాయంత్రాన్ని చూచి సిగ్గు పడుతున్నాడు.
నీడలు మరీ పొడుగయి కరిగి పోతున్నయి
చీకటి భయం భయంగా కమ్ముకుంటుంది ఎందుకు?
కొంచెం సేపయితే తనదే రాజ్యమని దానికే తెలియదు!
మునిగాళ్ల మీద లేచినా నాన్న మోకాళ్లే కనబడినప్పుడు ఒక భయం ఆదరమయింది
పగలు రాత్రి గడియారానికి కూడా తెలియవు
బతుకు యంత్రంలో సాయంత్రం నలిగి పోయింది
గాజు కళ్లలో కాంతి తళుక్కుమంటుంది. సంగీతం వింటుంది
రాత్రి ముదిరే లోగా మహెఫిలె ముషాయిరా సాగుతుంది
కన్నీళ్లు ఆ లోపలే ఇంకిపోనీ!
పంచుకునేందుకు ముచ్చట్లు ఎన్ని లేవు గనుక!
ఉదయం భాష హుషారు1
ఆసుపోసిన అనుభవాల తుంపర
పూలూ ఉన్నయ్ ముళ్లున్నయ్1
చిటికెన వేలు పట్టుకుని నడుస్తున్న తెలివి ఎంత రుచి?
అలలు రాళ్లకు కొట్టుకొని మురిసి పోతున్నయి
రంగుటద్దాలలోంచి చూస్తే వెలుతురు కనబడదు
అందరూ మోసే వారే అయితే పల్లకీ ఎక్కేది ఎవరు?
అగ్బరూ రాజ్యమేలాడు, అనామకుడూ రాజ్యమేలాడు
శిలాశాసనాలు వేయడం ఇద్దరూ మరిచిపోయారు
అడుగుజాడలను అలలు తుడిచేస్తాయి
శిలాస్తంభాలు కూడా గాలికి అరిగిపోతాయి
ఫలకం మీద పేరెక్కే దాకా అడుగులు పడుతూనే ఉంటాయి
దాద్ ఉన్నా లేకున్నా ఇర్షాద్ ఉంటుంది!!
మవునంగా నా కవితను మనసుల మీద చెక్కుతాను1
ఆనందంగా మరో సాయంత్రం అవుతాను!
Sunday, September 2, 2012
కవిత
ఈ కథ గ్రీసు దేశంలో వేలాది సంవత్సరాలకు ముందు ఎపుడో జరిగింది.
ఎథెన్స్ నగరానికి వెళ్ళే దారిలో ఇద్దరు కవులు కలుసుకున్నారు. కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకున్నారు. నమస్కారాలు, క్షేమ సమాచారాలు మామూలుగానే సాగాయి.
కవులు గనుక సంభాషణ సహజంగా, కవితల వేపునకు మరలింది. ఒక కవి మరొక కవిని అడిగాడు గదా! ‘అయ్యా! ఈ మధ్యన తాజాగా ఏమి వ్రాశారు? తప్పకుండా ఏదో రాసే ఉంటారుగా’ అని!
మొదటి కవి సంతోషంగా ముఖం పెట్టి ‘ఇప్పుడిప్పుడే ఒక మహత్తరమయిన కవిత రాయడం ముగిసింది.
అది నా కవితల్లోకెల్లాగొప్పది. అంతేగాదు, మన భాషలోనే గొప్ప కవిత అదే. అది నేను దేవుడి గురించి స్తుతిస్తూ రాశాను’ అన్నాడు.
కవి అంతే సంతోషంగా తన ముల్లెలోనుంచి కవిత రాసిన పార్చ్మెంట్ తీశాడు. ‘ఇదుగో! కవిత! నాతోనే ఉంది. చదివి వినిపిస్తాను. వింటారుగదా! రండి! ఆ సైప్రస్ చెట్టు కింద నీడలో చేరి కవిత అందాన్ని అనుభవిద్దాం!’ అన్నాడు.
కవితాగానం సాగింది. అది మరీ పొడుగాటి కవిత
‘గొప్ప కవితండీ! ఇది కలకాలం నిలిచి ఉంటుంది. తమ కీర్తిని నిలబెడుతుంది!’ అన్నాడు విన్న కవి.
ప్రశాంతంగా విని మొదటి కవి లాంఛనంగా ‘మరి తమరేమి వ్రాశారో? వినవచ్చునా అంటూ అడిగాడు.
‘నేను నిజంగా అంతగా ఏమీ వ్రాయలేదంటే నమ్మండి. తోటలో ఆడుతున్న కుర్రవాడి గురించి సరిగ్గా ఎనిమిదంటే ఎనిమిది పంక్తుల కవిత ఒకటి మాత్రం రాశాను’ అంటూ ఆ కవిత వినిపించాడు.
‘్ఫరవాలేదు. బాగానే ఉంది’ అన్నాడు మొదటి కవి.
తరువాత వారు ఎవరిదారిన వారు పోయారు.
తరాలు గడిచాయి. రెండు వేల సంవత్సరాలయింది. కవి రాసిన ఎనిమిది పంక్తుల కవిత ప్రపంచ భాషలన్నింటిలోకీ అనువదింపబడింది. ఆ కవిత తెలియని మనుషులు ఉండరంటారు.
మొదటి కవిగారి దీర్ఘకవిత కూడా నిలిచి ఉంది. కానీ అది గ్రంథాలయంలో, పండితుల సేకరణలలో మాత్రమే ఉంది. దాన్ని ఇష్టపడేవారు లేకపోలేదు. కానీ చదివినవారు మాత్రం తక్కువ.
-ఖలీల్ జిబ్రాన్ నుంచి
ఎథెన్స్ నగరానికి వెళ్ళే దారిలో ఇద్దరు కవులు కలుసుకున్నారు. కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకున్నారు. నమస్కారాలు, క్షేమ సమాచారాలు మామూలుగానే సాగాయి.
కవులు గనుక సంభాషణ సహజంగా, కవితల వేపునకు మరలింది. ఒక కవి మరొక కవిని అడిగాడు గదా! ‘అయ్యా! ఈ మధ్యన తాజాగా ఏమి వ్రాశారు? తప్పకుండా ఏదో రాసే ఉంటారుగా’ అని!
మొదటి కవి సంతోషంగా ముఖం పెట్టి ‘ఇప్పుడిప్పుడే ఒక మహత్తరమయిన కవిత రాయడం ముగిసింది.
అది నా కవితల్లోకెల్లాగొప్పది. అంతేగాదు, మన భాషలోనే గొప్ప కవిత అదే. అది నేను దేవుడి గురించి స్తుతిస్తూ రాశాను’ అన్నాడు.
కవి అంతే సంతోషంగా తన ముల్లెలోనుంచి కవిత రాసిన పార్చ్మెంట్ తీశాడు. ‘ఇదుగో! కవిత! నాతోనే ఉంది. చదివి వినిపిస్తాను. వింటారుగదా! రండి! ఆ సైప్రస్ చెట్టు కింద నీడలో చేరి కవిత అందాన్ని అనుభవిద్దాం!’ అన్నాడు.
కవితాగానం సాగింది. అది మరీ పొడుగాటి కవిత
‘గొప్ప కవితండీ! ఇది కలకాలం నిలిచి ఉంటుంది. తమ కీర్తిని నిలబెడుతుంది!’ అన్నాడు విన్న కవి.
ప్రశాంతంగా విని మొదటి కవి లాంఛనంగా ‘మరి తమరేమి వ్రాశారో? వినవచ్చునా అంటూ అడిగాడు.
‘నేను నిజంగా అంతగా ఏమీ వ్రాయలేదంటే నమ్మండి. తోటలో ఆడుతున్న కుర్రవాడి గురించి సరిగ్గా ఎనిమిదంటే ఎనిమిది పంక్తుల కవిత ఒకటి మాత్రం రాశాను’ అంటూ ఆ కవిత వినిపించాడు.
‘్ఫరవాలేదు. బాగానే ఉంది’ అన్నాడు మొదటి కవి.
తరువాత వారు ఎవరిదారిన వారు పోయారు.
తరాలు గడిచాయి. రెండు వేల సంవత్సరాలయింది. కవి రాసిన ఎనిమిది పంక్తుల కవిత ప్రపంచ భాషలన్నింటిలోకీ అనువదింపబడింది. ఆ కవిత తెలియని మనుషులు ఉండరంటారు.
మొదటి కవిగారి దీర్ఘకవిత కూడా నిలిచి ఉంది. కానీ అది గ్రంథాలయంలో, పండితుల సేకరణలలో మాత్రమే ఉంది. దాన్ని ఇష్టపడేవారు లేకపోలేదు. కానీ చదివినవారు మాత్రం తక్కువ.
-ఖలీల్ జిబ్రాన్ నుంచి
Sunday, July 1, 2012
నీ నీతి - కవిత
కుక్కనిస్తవా?
పెట్టనిస్తవా? అన్నడు మగవాడు.
నేను నీకు అమ్మను! అన్నది ఆడది.
బండబూతులనిపించింది గదూ!
మనమంతా మరి దిక్కుమాలినంత నీతి మంతులముగద!!
నాథా నేను నీకు కొడలనయితిని, మామా!
అంటుందొక నాయిక నాటకంలో
సిస్టర్ మీరు ఈ ప్రపంచంలో అందరికీ సిస్టరేనా,
మా బావగారికి కూడానా అంటడొక తుంటరి హీరో
అట పట్టి విటుండయి రాగజూచి
ఆయాసము చెందింది ఒక అమ్మ
ఈడిపస్ ను తుడిపేసింది ఒక హీరోయిన్
పండు తిన్న నాటి నుంచి పక్కటెముకతోనే సరిపోయింది బతుకంతా
యింకా సిగ్గొకటా?
కటకటా
శీర్ణమేఖల గురించి తెలుసా
దయ్యాన్ని నరకంలో దాచే సంగతి తెలుసా
నేలతో నింగి అన్నది నను తాకరాదని
స్పర్శ దండుగ – నిష్కర్శ దండుగ
ఆలోచనలతో పండుగ
తలనిండా మెండుగ
అర్థమయిందా ఏమన్నా
ప్రాదుర్భూత పురాతన కథా కాసార కల్లోలకృత్తటవర్తీ తత డిండీరచ్ఛటా మాత్రాన
ఈ మాటలో రంగుల్లేని నిజాలు వచ్చినవి.
నన్నేమన్నా మీ ఇష్టం
నెత్తికీ లోపలి మెదడుకూ
రంగెయ్యను తెలియని మనిషిని.
నీ మనసులో ఏదో ఉందనిన మనిషిలో ఏదో ఉంది.
నాలో బలహీనత ఉంది.
దిక్కుమాలిన మంచితనం ఉంది.
అదే మరి నీతిమంతనం
వెన్నల నవ్విననాడు విరిసిన మల్లెలు ఏరలేదు
నిప్పు లేకుండానే పొగ రగిలిన నాడు ఉలకలేదు పలకలేదు.
నీతిగదూ
దిక్కుమాలిన నీతి!!
Wednesday, June 13, 2012
Sunday, May 27, 2012
Friday, April 13, 2012
ఏముంది - కవిత
ఏముంది
చెప్పవలసింది చాలనే ఉంది
ఆ ఊరిగురించి చెప్పాలె
నా పేరు గురించి చెప్పాలె
అశలు ఆశయాల గురించి చెప్పాలె
అందని అంచుల గురించీ చెప్పాలె
ఉన్నది ఉన్నట్టు చెప్పాలె
తెట్టెను కదిలిస్తే తేనెటీగలు
మిమ్ములను కూడా కుట్టిపెడతయి
బాలసంతువానికిచ్చి
దో ఆనాకు కొన్నరంటే అర్థమవుతుందా
బడికి వెల్లి కూచుంటే
బలవంతంగా ఇంటికి తెచ్చారంటే అర్థమవుతుందా
అక్కడనే మొదలయింది వైరుధ్యం
ఇంటిపేరు ఎందుకు వచ్చిందో తెలువదు.
తాతగారు ఏం చేసేవారో తెలువదు
తెలిసింది చెప్పుదామంటే
ఎక్కడ మొదలుపెట్టాలె
నా చాటభారతం నాకే నచ్చనట్టుంది
అనుకుంటే అంతా ఆనందమే
కాదనుకుంటే ఇంతవరకు ఎట్లా వచ్చాను
అనుభవాలకు సొంత రంగులు ఉండవు
నేనూ సంతోషంగా బతికినట్టే గుర్తు
నేటికీ పెదవులతో పాదులు తవ్వి
కన్నీటితో తడిపి
చిరునవ్వులు నాటుతున్నాను
బాగానే పూస్తున్నయి
కనుకనే చెప్పేందుకు
ఏదో ఉంది
Monday, January 16, 2012
ఆశారాజు - ఇప్పుడు
ఆశారాజు ఇప్పుడెట్ల ఉన్నడని కాదు
ఇది ఆతని కొత్త కవితా సంకలనం పేరు
నా దృష్టిలో రాజు దమ్మున్న కవి
చెప్పదలుచుకున్నది అంత బలంగా చెప్పడం చాలా మందికి చేతగావడం లేదు ఈ మధ్య
అందుకే రాజుకు నా సలాం
హార్మోనియం అని ఒక ఖండిక
అందులోనుంచి నాలుదు లైన్లు చదవండి
రాజు అంటే ఏమిటో అర్థమవుతుంది.
ఇది ఆతని కొత్త కవితా సంకలనం పేరు
నా దృష్టిలో రాజు దమ్మున్న కవి
చెప్పదలుచుకున్నది అంత బలంగా చెప్పడం చాలా మందికి చేతగావడం లేదు ఈ మధ్య
అందుకే రాజుకు నా సలాం
హార్మోనియం అని ఒక ఖండిక
అందులోనుంచి నాలుదు లైన్లు చదవండి
రాజు అంటే ఏమిటో అర్థమవుతుంది.
కవిత్వం కలలో ఉంటుంది
కత్తి వొరలో ఉంటుంది
అమ్ములపొదిలో ఉంటుంది
ఆత్మవిశ్వాసంలో ఉంటుంది
నమ్మకంలో ఉంటుంది
చెదరని ఆశయంలో ఉంటుంది
నిద్రపోని ఆయుధంలో ఉంటుంది
ఎక్కడని కనిపెడతావు
ఎట్లా అరికడతావు
కవిత్వం బతికించే ఊపిరి
ఊగేటి ఉరికంబం
ఉప్పొంగే జీవితం
ఎన్ని ఊళ్లని వెదుకుతావు
ఎన్నాళ్లు తిరుగుతావు
మరణం కవిత్వం
జననం కవిత్వం
కదనం కవిత్వం
కన్నీళ్లు కవిత్వం
నూకు తెలియదు
జైలు గోడలూ కవిత్వం
కవిత్వాన్ని ఆపుతావా
బ్యాక్ కవర్ మీద వేసిన కవిత పూర్తి రూపం నాకు అన్నింటికన్నా బాగనిపించింది.
అందులో రాజు (పహిల్వాన్ తమ్ముడు) అసలు రూపం కనబడుతుంది
Thursday, December 29, 2011
నా కవిత - ఏముంది
ఏముంది
పదిమంది రాసింది చదివినందుకు నేనున్నాను
పదిమంది పాట విన్నందుకు నేను మిగిలాను
అందరి ఆలోచనలు తలలో ఆడుతున్నందుకు
నేనింకా కదులుతున్నాను
కలం కన్నీళ్లతో కాగితాన్ని తడిపింది
గతంలోని బరువును ఊపిరి తుడిపింది
మెరుపు విరిగి
ముక్కలు తల నిండా పరుచుకున్నాయి
చిత్తడి నేలలోంచి
అక్షరాలు మొలకెత్తుతున్నాయి
వాన వెలిస్తే బాగుండును
పొగచూరిన ఆలోచనల వాసనలోనుంచి
సారాంశం వాక్యాలను వెతకగలిగే వాడిని
సంతకాలకు రంగులున్నాయా
ఎందుకట్లా మొరటు గొంతులు
కనుపాపల మీద నాట్యమాడుతున్నాయి
గీతలు కరగక ముందే
ఆకారాలను కలగలిపి
రేపటి కొరకు వంతెన కొనసాగించాలి
కనీసం మాటలకు
వైశాల్యం పెరుగుతుంది
లేకుంటే అంతా అయోమయం
చెప్పేందుకు నేనుండాలె గదా
Saturday, December 3, 2011
సినారె కవితా సంకలనం - నా సమీక్ష
జ్ఞాపకాల నిధులు
నా చూపు రేపటి వైపు (కవితా సంకలనం) రచన: డా. సి. నారాయణ రెడ్డి వెల: రూ. 150/-, ప్రచురణ: వరేణ్య క్రియేషన్స్, హైదరాబాద్ ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ
-గోపాలం కె.బి., October 30th, 2011
పద్మభూషణులు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా. సి. నారాయణరెడ్డి కవితా కృషీవలులు. ఆయన జీవితమే కవిత. ఒక విశ్వంభర, కర్పూర వసంతరాయలు లాంటి కావ్యాన్ని వెలయించినంత తీవ్రతతోనే ఆయన సినీగేయాన్ని కూడా రాస్తారు. ఆయన ఆలోచనే కవితగా సాగుతుంది. అందుకే ప్రతి జన్మదినానికి ఒక కొత్త కవితా సంపుటి కూడా పుడుతుంది. ఎనభయి వసంతాలు గడిచిన పండుగనాడు ఈ సంకలనం వచ్చింది. ఇందులో కవితలు 80 మాత్రమే. వీటన్నింటిలోనూ ఒక తలపండిన తాత్వికుడుగా సినారె మనలను పలకరిస్తారు.కవికి మనసు మాత్రమే ఉంటుంది. వయసు ఉండదు. తలపండినదన్న భావం తలపులలో రాదు. అందుకే ‘ఎదుట నిలిచే సుదూర గమ్యం’ అన్న కవితలో ఆయన ‘గిరి శిఖరాలపై నుంచి దూకే జలపాతాలు, మోకాళ్ళు విరిగి పోతాయేమోనని శంకించవు’ అంటారు. అంతటి ఉత్సాహంతో మస్తకంలోని ఆలోచనలను పుస్తకంగా మనముందు పరిచారాయన.
శీర్షిక - నా చూపు రేపటి వైపు - అని ఇందులో వయసు వాసన ఏమయినా కనబడుతుందా?
‘గతం నిష్క్రమించింది. అమూల్య జ్ఞాపకాల విధులను నాకు మిగిలించి, అది నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది’’. - అంటారు మొదట్లో. కానీ వెంటనే ‘‘వర్తమానం నాతో చేయి కలిసి నడుస్తున్నది’’ అంటారు. అక్కడ నుంచి కవి ముళ్ళబాటలో నడిచి, భవిష్యత్తును చేరుకుంటే అది ఆయన పాదాల ముందు వాలుతుంది!
ఈ శీర్షిక కవితను 85వ పేజీలో వేశారు. అక్కడ దాని భావం బాగా పండుతుందని కావచ్చు. జ్ఞాపకాల నిధులు సాధారణంగా ఎవరినయినా నాస్కార్జియాలోకి లాక్కుపోతాయి. కానీ ఆలోచనా శీలులయిన ఈ కవి మొదటి కవితలోనే ‘ఆలోచనలకు పదును పెడుతూ కూచున్నాను’ అని ప్రకటించారు. సినారెలోని కవి తత్వం ఆ ఒక్కమాటతో ఆవిష్కరింపబడుతుంది. మొదటి కవితలోనే (సృజనయాగం). ఈ మాట రావడం యాదృచ్ఛికమా? పథకం ప్రకారం వచ్చిందా? శీర్షికకు అనుగుణంగా, రేపటివైపు చూపులు సంకలనం అంతటా కనిపిస్తాయి. బలమయిన ఆశాభావం అడుగడుగునా ఎదురవుతుంది.
చాలా కవితల్లో కాలగమనం గురించిన ప్రసక్తి ఉంది. ‘ఇలా ఎంతకాలం అవిశ్రాంతంగా సాగిపోతావు’ అని కవి గడియారాన్ని అడిగారొక చోట (కాల సూచిక). ‘ఎగిరిపోయిన జ్ఞాపకం’ అన్న కవితలో ముందుకు సాగిపోతున్న జలధార, వెనకవైపు తిరిగి చూస్తుందా? అంటారు. ‘నీ ప్రయాణం ఎంతకాలమని? అంటూ జీవితానే్న ప్రశ్నిస్తారొక చోట. వయసు వాలిపోతున్నా, మనిషి నిటారుగా నిల్చోవాలి అంటారు మరోచోట.
సంకలనంలోని కవితల్లో ముఖ్యంగా కనిపించే మరో అంశం స్మృతులు. అయినా ఎక్కడో వాటిని గురించిన బాధ కనిపించదు. స్మృతులలో నుంచి బలమయిన సమస్యలు బయటపడతాయి. తలుపులు మూసుకుని ‘కలగన్న గది’ కలలోని సన్నివేశాలను నెమరు వేసుకుంటూ, తలుపులు తెరుస్తుంది.
ఇన్ని కవితల్లోనూ మనుషులు కనిపించరు. పక్షులు, చెట్లు, కొండలు, కళ్ళు, చెవులు, ముక్కు లాంటివి ఎక్కువగా భావాలకు ఆలంబనలయి ముందుకు నడిపిస్తాయి. ఆలోచనలకు పదును పెడుతూ కూర్చున్న కవికి ఒంటరితనంలోనూ, చూపులు రేపటిపైనే. కానీ గమనించవలసిన మరో అంశం. అక్కడక్కడ మరణం. శూన్యం లాంటి బలమయిన భావాలు! శూన్యాన్ని వెళ్ళి కలిసినప్పుడు అది ‘నాలో కలిసిపో!’ అని పిలిచిందట. కవి మాత్రం ‘మానవాళికి దూరమయి, అస్తిత్వాన్ని కోల్పోవడం, కుదరదంటారు. చదువుతూ ముందు సాగితే చివరకు ఏకాంతం గురించి కవిత రానే వచ్చింది.
‘కాలం గీసిన రేఖ’, ‘ఈ పూట’, ‘నడుస్తూ నడిపించే కాలం’, ‘కాలజ్ఞత’, ‘తిరిగి చూసుకుంటే’, ఇవన్ని చివరి భాగంలో ఇంచుమించు వరుసగా వచ్చిన కవితలు. అలా సాగుతూనే ఒకచోట ‘సూర్యోదయం సరియైన సమయానికే జరిగిందని సంతృప్తీ కనబడుతుంది.
‘సత్తా ఉన్నంత మాత్రాన విత్తనాలన్నీ మొలకెత్తవు’ అంటూ సాగే కవిత ప్రశ్నల ఆంతర్యం’ కవిగారు తమను తాము అడుగుతున్న ప్రశ్నలకు నికషోపలం!
జాగ్రత్త! ప్రాసలు కనబడవు. మాటకారి తనం కనబడదు. కాలం గడిచింది గదా! పాత సినారె కనబడరు! ఈయన మరెవరో. తలపండిన తాత్వికుడు!
కవితే తన చిరునామా అన్న ఈ కవిగారి మరో సంకలనం కొరకు ఎదురు చూద్దాం.
-గోపాలం కె.బి.
Friday, November 18, 2011
రాతి కెరటాలు - సమీక్ష
బతుకు పరిశీలన!
-గోపాలం కె.బి.
(ఆంద్రభూమి దినపత్రిక నుంచి)
స్కూలు మొత్తంలో/వారికిష్టమైంది గంటే/ ప్రేయర్ గంట కాదు/ఇంటికెళ్ళే ప్రేమ గంట, అంటాడు కవి గోపి. ‘అది అమ్మపిలుపులా’ కమ్మగా ఉంటుంది. అన్నప్పుడు గోపి, వాళ్లది కాక తన బాల్యం గురించి చెపుతున్నాడనిపిస్తుంది.
కవిగా ఎన్. గోపి ప్రస్థానం ‘తంగెడు పూల’తో 1976లో మొదలయింది. పరిశోధన విమర్శ, అధ్యాపకం, పెద్ద ఉద్యోగాలు, పేపర్ కాలం, నిర్వహణ లాంటి పనులన్నింటినీ ఒక చేత్తో చేస్తూ, గోపి మరొక చేత్తో బలంగా కవితా వ్యవసాయం సాగించాడు. కనుకనే ఇప్పటికి 16 సంకలనాలు వచ్చాయి. ఇది 17వది. మధ్యలో ‘నానీ’లు ప్రత్యేకంగా వచ్చాయి. ఎన్ని వచ్చినా నేటికీ గోపి కవితలో ‘కవిత్వం’, బిగువు తగ్గలేదు. వాక్యాల నడుం విరిస్తే వచన కవిత అన్న వ్యాఖ్య గోపీ విషయంలో వర్తించదు. అతని కవిత్వంలో ‘నీటి తల్లికి ఇన్ని సమాధులా?’ అన్నా, ‘ఆకలిదెంత చైతన్యమో?’ అన్నా ప్రకృతి పరిశీలన, బతుకు పరిశీలనలతో నిండిన కవిత పలుకుతుంది.
చిత్రదీపాలు వెలిగించిన గోపి, చుట్టకుదురులో కుదురుకుంటూనే జలగీతాలు పాడాడు. మా ఊరు మహాకావ్యం అంటూ ఈ కవి తన పల్లెతనాన్ని, పట్టు తప్పకుండా ప్రదర్శించాడు. రాతిలో కూడా కెరటాలు చూడాలనుకున్నాడు. ఈ సంకలనంలో మొత్తం 44 కవితలున్నాయి. అన్నీ గొప్పవి అని బహుశా గోపీ కూడా అనుకోడు. 2010, 2011లలో రాసిన ఈ కవితలను పుస్తకంలో కలగలిపి ముద్రించారు. కాలక్రమం ప్రకారం వేస్తే కవిత్వతత్వం, కవితత్వం మరింత బాగా ఆవిష్కృతమయ్యేవేమో?
‘ఏక్తార’ అన్న కవితలో ‘ఎన్నాళ్ళ నుంచో వెతుకుతున్న స్క్రూడ్రైవర్ దొరికింది. అతుక్కుపోయిన తలుపులను తెరిచి నాలోకి వెళ్ళాలి - అంటాడు.
‘ప్రక్రియ’లో పెన్నుది బంగారు పత్తి అయితే, అక్షరాలు బంగారమవుతాయా? అని ప్రశ్నించి, అయినా కవిత్వం గాలిలా వ్యాపిస్తుంది’ అంటాడు. ఆ కలం గురించే మరో చోట ‘కలం జేబులో బందీ అయిపోయింది’ అంటాడు ఈ సంకలనంలో మగ్న, పాదచిహ్నాలు, లాంటి మరెన్నో ‘మంచి’ కవితలున్నాయి. సహజంగానే కవి గోపి, ప్రపంచంలోని సంఘటనలకు తన ప్రపంచలోనికి సంఘటనలకు స్పందించి కవితలు రాశాడు. కాళహస్తి గోపురానికొక కవిత, కవి గుడిహాళం స్మృతికి ఒక కవిత.
ఓల్గా గారికి 60 ఏళ్ళు నిండితే కవిత పుట్టింది. గోపికి కూడా అరవయి నిండినయి. అందుకేనేమో కొంచెం బతుకు తత్వం గురించిన ఆలోచన ఎక్కువయింది. రోజులు మారిపోతున్నాయి అంటాడు. ఇల్లు పంచుకుంటే స్పందిస్తాడు. అమెరికా నచ్చలేదు. తరాల అంతరం కూడా కదిపింది. దీన్ని లామెంటింగ్ అంటారేమో?
గుత్తెదార్లు, నీళ్ళ సీస, పెన్ను పత్తి లాంటి ప్రయోగాలు చేసి గోపి తన మట్టివాసనను చెప్పక చెప్పుకున్నాడు. పెన్ను ‘నిబ్’ను పత్తి అనేవాళ్ళమన్న సంగతి గుర్తుకు వచ్చి ఒళ్ళు పులకించింది.
గోపిలో ఒక మెత్తని మిత్రుడున్నాడన్న సంగతి అతని పుస్తకాన్ని శేషాద్రిగారికి అంకితమివ్వడంలో కనబడుతుంది. అలాగే చాలా కవితల్లో గోపి మనలను కొన్ని పనులు చేయవద్దని హెచ్చరిస్తాడు. అతనికి డిస్టర్బెన్స్ ఇష్టం లేదులాగుంది!
ఈ సంకలనం పేరు ‘రాతి కెరటాలు’. ఆ పేరున మొదటి కవిత ఉంది. ఆ శీర్షికకూ సంకలనంలోని మిగతా 43 కవితలకూ సంబంధం ఉందా? ఏమో?
డా. ఎన్. గోపి ‘పత్తి’ నుంచి ఇకముందు మరిన్ని మంచి కవితలు, రచనలు తప్పక వస్తాయన్న నమ్మకం ఉంది.
రాతికెరటాలు
డా. ఎన్. గోపి (కవితా సంకలనం)
పేజీలు: 80, వెల: రూ. 60/-
ప్రతులకు: అభవ్ ప్రచుఠణలు
13/1/5బి, శ్రీనివాసపురం
రామంతాపూర్, హైదరాబాద్-13
Wednesday, November 9, 2011
కొండ - కవిత
ఇది ొక అజ్ఞాత కవి రచనకు నా అనువాదం మాత్రమే
నీ చేతిలో
నీవు కవివయితే, నన్ను అవుననిపించు.
కవిత చూపించు, అంటావు నీవు.
మరి నేను నీ చేతిలోకి ఒక రాతి గులకను పడేస్తాను
చిన్నగా
గుండ్రంగా
మామూలుగా, గులకరాయి
నేను మురిసి పోవాలా?
ఇదేం కవిత, ఇదేం ప్రాస?
గద్దించి అడుగుతావు నీవు
నాకు నీ మనసు తెలుసు, కానీ,
నీ చేతిలో ఒక కొండ ఉంది
దాని శిఖరం ఒకప్పుడు ఆకాశాన్ని తాకి ఉండవచ్చు
కానీ, కాలం, కన్నీళ్లూ దాన్నిప్పుడు కరిగించేశాయి
అదిప్పుడు కొండ కాదు మరి!
నీ చేతిలో గతమంతా ఉంది
అది కరిగి అరిగి గులకయింది
కొండ గుండుగా,
గుండు గులకగా మారింది.
ముందు ముందది ఇసుక రేణువవుతుంది.
నీ చేతిలో ఒక నక్షత్రశకలం ఉంది
మహావిశ్వం లోని ఒక అంశం ఉంది.
ఆ రేణువు ఏ బీచిలోనో కలిస్తే
నక్షత్రాలకన్నా ఎక్కువయిన సంఖ్యలో ఒకటవుతుంది
నీ చేతిలో ఒక మూలకం ఉంది
అది నీటిలో మునుగుతుంది.
కానీ ఒడుపుగా వేస్తే మాత్రం ఎగురుతూ నాట్యాలాడుతుంది
నీటి మీద ఎగురుతూ నిక్షేపమవుతుంది!
బహుశః నీ చేతిలోని రాతితోనే
గోలియాత్ ప్రాణాలు పోయి ఉంటాయి.
అది, రాక్షసుడిని కూడా లొంగదీసిన
డేవిడ్ నమ్మకానికి గుర్తు!
నీ చేతిలో ఉన్నది
ప్రశ్న ఒకటే కాదు, జవాబు కూడా!
కవిత ప్రాస అందులోనే ఉన్నాయి
వాటిని కల్పించింది నాకన్నా మాటకారి మరెవరో!
Subscribe to:
Posts (Atom)















