Showing posts with label విజయగోపాల్. Show all posts
Showing posts with label విజయగోపాల్. Show all posts

Monday, March 30, 2015

నా కొడుకు తెలుగు రచన

మిత్రులారా,
నా కొడుకు తెలుగులో రాసిన నాలుగు మాటలను చదవండి.
వీలయితే కామెంట్ చేయండి.

Link here!

Sunday, December 28, 2014

బాహర్ నికాలో - మర్ జాయేగీ



పొట్లం మీద అక్షరాలు భయపెడుతున్నయ్

పొగాకు చంపుతుంది, అని

అవునూ,

పొగాకు చంపుతుందా

దానికంత దమ్ముందా



ప్రేమ చంపుతుంది

ప్రేమికురాలు చంపుతుంది

అన్నం చంపుతుంది

ఆకలి చంపుతుంది

మామూలుగా ఒక మాట చంపుతుంది

ఇక పొగాకు చంపితేనేమట



పోతే పోనీ పోరా

నాబతుకు నాచావు

అందరూ చంపే వాళ్లే

అన్నిటికన్నా ముందు నా ఆలోచనలు

ఆ తరువాతే మిగతా అన్నీ

పోతే పోనీ పోరా

Tuesday, October 21, 2014

బీభత్స, వినోదాల మధ్యనే కదా జీవితం!

ఎప్పుడో రాసిన నా వ్యాసం ఇది.


జీవితం కష్టసుఖాలు కలగలసిన కాలక్రమం. మనుషులుగా మనం మాత్రం ప్రతినిత్యం ఈ సత్యాన్ని మరిచిపోవాలని ప్రయత్నం చేస్తుంటాం. కానీ ప్రకృతి మాత్రం తన ప్రకృతిని ప్రదర్శిస్తూనే ఉంటుంది. ‘‘ఈ ప్రకృతిని పూర్తిగా అర్థం చేసుకోవడంఅనుభవించడం వీలుగాదు’’ అన్నాడు డేవిడ్‌ థోరో. అలా అనుకోవడం తప్పులాగుంది. అందుకే ప్రకృతి తన తీరును మన ముందు ఉంచుతూ ఉంటుంది.

భూమి రకరకాలుగా మారి ఈనాటి రూపం పొందింది. దానిమీద వాతావరణం తయారయింది. నిప్పుదొరికి మన బతుకులను మార్చేసింది. నీరు మన ఉనికికే ఆధారంగా నిలబడి ఉంది. ఇలా మనల్నిఅంటే మానవజాతిని ముందుకు నడుపుతున్న ఈ శక్తులే ఒక్కోసారి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. భూమిదాన్ని ఆవరించుకుని ఉన్న తత్వాలు ఇలా విలయతాండవం చేసినప్పుడు మనుషులు ఒకసారి విస్తుపోయి ‘‘అవునుగదా!’’ అనుకుంటారు.

చరిత్రలోకథల్లోసాహిత్యంలో వైపరీత్యాల గురించి లెక్కలేనన్ని విశేషాలున్నాయి. అయినా అవన్నీ ఒకక్షణం పక్కన బెట్టి మనమంతా సరదాగామరో రోజు గురించిసంవత్సరం గురించి ఆలోచిస్తాం. అది సహజం. జీవితంలోని ఈ నాటకీయతఈ సంబరాలుభయాలు అన్నీ కలిస్తేనే అది అసలు సిసలయిన సత్యమవుతుంది.

చావు తప్పదు. అయినా దాన్ని గురించి ఆలోచించడమే తప్పనుకుంటాం. అపాయాలుఆపదలు తప్పవు. అయినా వాటి గురించి అనుకోకుండా ఉండడం అలావాటు చేసుకుంటాం.

గుజరాత్‌లో పొద్దున్నే జెండాకు దండం పెట్టడానికి బయలుదేరిన ఎంతోమంది పిల్లలు ఇంటికి తిరిగి రాలేదు. రావడానికి ఇల్లూ మిగలలేదు. వాళ్ళూ మిగలలేదు. జెండా పుణ్యమా అని కొందరు బ్రతికి బయటపడినవారు ఉన్నారు. ఇళ్ళు మాత్రం ఇసకలో కట్టిన పిచికగూళ్ళలా కుప్పకూలాయి.

టీవీలో మధ్యాహ్నం దాకా సంబరాలు చూసినవారుఆ తర్వాత సర్వనాశనమయిన పట్టణాలనుబతుకులనూ చూశారు. అప్పటిదాకా దేశభక్తిక్రమశిక్షణలతో ఉప్పొంగిన గుండెలు,ఒక్కసారిగా బరువెక్కాయి. అందరి మనసుల్లోనూ ఒకటే భావం! ఆ కూలిన ఇంటి ముందు నిలబడిదిగులుగా చూసే పరిస్థితి నాకే వచ్చి ఉంటేగుండె మరింత బరువవుతుంది.

ఆపదలు చెప్పిరావుప్రకృతి వైపరీత్యాలు అర్థం కావు. మానవులంతా బతుకుదెరువు పేరుతో అపాయాల్లోకి నడిచివస్తున్నారు. అందరూ ఒకే చోట గుమికూడుతున్నారు. గుజరాత్‌ భూకంపం మరీ పెద్దది. అందుకే పల్లెల్ని కూడా అది నేలమట్టం చేసింది. గుడిసెచిన్న ఇల్లు కూలితే అందులో ప్రమాదం తక్కువ. అందులో చిక్కుకున్న వాళ్ళను రక్షించడమూ సులభం! ఆరేడు అంతస్తులుగా ఇళ్ళు కట్టుకుని నగరాల్లో బ్రతుకుతున్నవారే ఈ భూకంపంలో ఎక్కువగా మరణించారునష్టపోయారన్నది మాత్రం నిజం.
మన దేశంలో రాజధానితో సహా ఎన్నో నగరాలుభూకంపాలకు గురయ్యే అవకాశం ఉందని తెలుసు. తుపానులువరదలు మొదలయిన బీభత్సాలకు నగరాలుజనావాసాలు గురవుతూనే ఉన్నాయి. అలాగని అందరూ ఆయా ప్రాంతాలను వదిలి వెళ్ళిపోతున్నారాకనీసం భయపడుతున్నారా?

ఇక్కడ నష్టం జరిగే వీలుందని తెలిసి కూడాచింతించకుండా ఉండిపోవడం రెండు కారణాల వల్ల జరుగుతుంది. ఒకటితప్పని పరిస్థితుల్లోఅంతకంటే మంచి అవకాశం లేకుంటే అక్కడే ఉండడం మంచిది. అపాయం వచ్చిననాడు చూడవచ్చు! రెండవదిఒక రకమయిన మొరటుబారిన బ్రతుకుతీరు. ‘‘మనకు గతం మంచి పాఠాలు నేర్చుకునే అలవాటులేదు’’ అంటారు గోల్డెన్‌.
ప్రమాదం జరిగితే వెంటనే పుట్టే ప్రశ్న ‘‘ఎందుకిలా జరిగిందీ?’’ అని. వైజ్ఞానికులు చాలా రకాల ప్రమాదాలకు కారణాలు చెప్పగలుగుతున్నారు. కొన్నింటిని ముందుగా సూచించగలుగుతున్నారు కూడా!

ఒకప్పుడు ప్రమాదాలు జరిగితేవివరాలు అంతగా తెలిసేవి కావు. సమాచారప్రసార సాధనాలు బాగా పరిణతి చెందిన ఈ రోజుల్లో ప్రమాదం తాలూకు వివరాలు క్షణాల మీద మన ముందు దర్శనమిస్తున్నాయి. ఒక్క క్షణం విస్తుపోయినా దూరం నుంచి చూసిన వారు మళ్ళీ రోజువారీ కార్యక్రమంలో మునిగిపోతారు. వార్తల ఛానల్స్‌ భూకంపం భీభత్సాన్ని చూపుతుంటేమిగతా ఛానల్స్‌ వినోదాన్ని చేటలతో చెరుగుతూనే ఉన్నాయి. జీవితమూ అంతే! మనంమనవారు కానంతవరకు ఫర్వాలేదు. అయితే ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన వారికి మాత్రంవెంటనే కొంతతర్వాత మరికొంతశాశ్వత ప్రాతిపదిక మీద ఇంకొంత సాయం అవసరం.


పట్టించుకోనివారు ఉన్నట్లేచేతనయినంత సాయం చేసేవారు కూడా ఉండడం గమనించదగింది. కాలం గడిస్తే 26 జనవరి భూకంపం చరిత్ర అవుతుంది. కొందరికి మాత్రం అది వ్యక్తి చరిత్రలో భాగమవుతుంది. వారి కోసం మనమేమి చేయగలం

Thursday, July 3, 2014

గొప్ప వారు - గొప్ప ఊరు

మీ ఊళ్లో పెద్దవాళ్లెవరయినా పుట్టారా? ప్రశ్న- లేదండీ! అందరూ పిల్లలే పుడుతున్నారు!జవాబు.
*
నీలంరాజువారు: లక్ష్మీ ప్రసాద్‌గారు ఫోన్ చేశారు. నేను మురళీధర్‌గారిని గుర్తు తెచ్చుకుని తికమకపడ్డాను. ఆయన నన్నందులోంచి బయటపడేశారు. ఈలోగా ఆయనకేదో అవాంతరం వచ్చి మళ్లా ఫోన్ చేస్తానుఅన్నారు. పెద్దాయన ఎందుకు ఫోన్ చేశారా? అని నాకు గాబరా! ఆయన మళ్లీ పిలిచి (కాల్ చేసి!) ఏవో పుస్తకాల సంగతి మాట్లాడారు. మా తండ్రి వెంకట శేషయ్యగారి జీవిత చరిత్ర పంపుతాను చదవండిఅన్నారు. నేనిక్కడ లేచి నిలబడి దండం పెడుతున్నానుఅన్నాను. మరిన్ని మాటల తరువాత, మీరు చాలా ఎమోషనల్కదా అన్నారు. ఎక్సయిటబుల్కూడా అన్నాను నేను. పెద్దవాళ్ల భుజాల మీద ఎక్కి ప్రపంచాన్ని చూచానన్న సైంటిస్టు నాకు ఆదర్శం, అని వినయంగానే అన్నాను. నేను ఈ ప్లానెట్ మీద ఉన్నంత కాలం, మన మైత్రి ఉంటుందన్నారాయన. భుజాలు పొంగిపోయాయి. ఆయన గొప్పవారు!

* ఇజీనారం: గిరీశం గారు గొప్పవారుట్రా, అడుగుతుంది కన్యాశుల్కంలో బుచ్చమ్మ. అంతాయింతా కాదు, సురేంద్రనాథ బ్యానర్జీ అంత గొప్పవారు, జవాబిస్తాడు తమ్ముడు వెంకటేశం! కన్యాశుల్కం గొప్ప రచన. దాన్ని సృష్టించిన గురజాడ అప్పారావుగారు, మరింత గొప్పవారు (ఇందులో కథాక్రమం కొంతవరకు మృచ్ఛకటికానికి అనుసరణ అన్న సంగతి మీరు విన్నారా?) అప్పారావుగారి ఇంటిని కాపాడిన వారు ఇంకా గొప్పవారు. ఆయన రాతబల్లను, కళ్ల జోళ్లను కళ్లారా చూసిన నేను కూడా కుంచెం, కుంచం, కొంచెం గొప్పవాణ్ని! భళా!

* గొప్ప ఊరు: విజయనగరం చూడాలని నాకు చిన్నప్పటినుంచీ ఉంది. మనకేమో, యాత్రకో, పెళ్లికో తప్ప మరో ఊరు పోయే అలవాటు లేదాయె! మొత్తానికి ప్రసాదుగారనే మిత్రుల పుణ్యమా అని విజయనగరం వెళ్లాను. అక్కడ దిగగానే, ఆ నేలను తాకి మొక్కాను. ఎందరో మహానుభావులు నడిచిన గొప్ప నేల అది. గురజాడవారు, ద్వారం నాయుడుగారు, కోడి శ్రీరామమూర్తి, శ్రీశ్రీ, రోణంకి, నారాయణబాబు, చాసో, పతంజలి, మా దాట్ల (రచయితల పేర్లే వస్తున్నాయి. అక్కడ మరెందరో గొప్పవారుండే వారు, ఉన్నారు. ఉంటారు!) నారాయణదాసు, బుర్రకథ కుమ్మరి మాస్టారు...సరే, విషయంలోకి వస్తాను! తాపీ ధర్మారావు, సాలూరు రాజేశ్వరరావు!!! వాసా వారు, అంట్యాకుల పైడరాజుగారు. ఇక చాలు ఈ ప్రవాహం ఆగదు!


* బొంకుల దిబ్బ: ఈ పేరు కన్యాశుల్కం కారణంగా నాకు చిన్నప్పటినుంచీ తెలుసు. పూసపాటి రాజుల కోటకు ఎదురుగా ఉండే ఖాళీ స్థలం అది. బొంకులు అంటే అబద్ధాలు! అక్కడ జరిగే వ్యవహారాల కారణంగా ఆ పేరు వచ్చిందని కథ ఏదో విన్నట్టు గుర్తు. స్వాతంత్య్ర పోరాటంలో ఈ బొంకుల దిబ్బ వద్ద వ్యక్తి సత్యాగ్రహం నిర్వహించారు. అందులో స్థానిక నాయకులు కొందరు అరెస్టయ్యారు. 1940నాటి మాట అది. మరే ఊరయినా ఆ ఖాళీప్రదేశంలో పేద్ద భవనాలు లేచి వుండేవి. అలాంటి కీలకమయిన చోటది! విజయనగరం వారు మాత్రం దాన్ని అట్లాగే కాపాడుతున్నారు. అక్కడ కూరగాయల మార్కెటు నడుస్తున్నది. మరి ఆ వ్యాపారంలో బొంకులుంటాయా? ఉండవు. లేకుంటే అంటే, ఉంటే (!) అది కొనసాగదు గదా!

గొప్పవాళ్లు: నాకక్కడ మరో ప్రసాద్‌గారు పరిచయమయ్యారు. రచయిత, పాత్రికేయుడు అని చెప్పారు. ఆయనొక మంచితనపు మూట! మాటలంటే మంచి మాటలే గల పేటిక! నాకు ఊరు చూపింది ఆయనే. గురజాడ వారి ఇంటికి వెళ్లాము. చూడగానే నాకు కళ్లల్లో నీరొచ్చింది. నాకాయనంటే కొంచెం అభిమానం ఎక్కువ! ఇల్లు నిజంగా రోడ్‌మీద ఉంది. అది నిజంగా రద్దీగల దారి. ఇంట్లో లైబ్రరీ నడుపుతున్నారు. (అవసరమా!) ఎక్కడపడితే అక్కడ అందరూ కూచుని పత్రికలు చదువుకుంటున్నారు. పై అంతస్తులోని పంతులుగారి స్వంత గది, పక్క గదులను వదిలేశారు నయం! అక్కడ బయట గదిలో ఒక పడమటి అమ్మాయి చిత్రం ఉంది. అది మెటిల్డాఅంటారు మా శ్రీనివాస్‌గారు! పంతులుగారి గదిలో కొన్ని అలనాటి వస్తువులను కాపాడుతున్నారు. అక్కడ కింద ఒక గదిలో నాకొక విశేషం కనిపించింది. ఒక అమ్మాయి, కన్యాశుల్కంలోని సన్నివేశాలను (శతజయంతి సందర్భంలోనా?) బొమ్మలుగా గీసి ప్రదర్శించింది. ఆమెచూరిష్‌గా ఉన్నా, ఆ బొమ్మలను అక్కడ ప్రదర్శనకు పెట్టారు.
ప్రసాద్‌గారు నాకు మాటల సందర్భంగా మరో గొప్ప వ్యక్తి గురించి చెప్పారు. బోలెడన్ని పొడి అక్షరాలున్న పేరున్నా ఆయనగారు ఒకానొక సాగిరాజుగారు. వృత్తిరీత్యా లాయరు. కళా, సాహిత్యాల పోషకుడు. ఆయన జిల్లాలోని రచయితల పుస్తకాలు తెచ్చి, సగం ధరకే అమ్ముతుంటారు. ఆయనను ఇంటికి రప్పించి మరీ వెళ్లి కలిసాము. నేను కొన్ని పుస్తకాలు తెచ్చుకున్నాను కూడా. అందులో ముఖ్యంగా తలిసెట్టి రామారావు కార్టూన్ల గురించిన పుస్తకాలు దొరికాయి.

* సంగీత కళాశాల: కర్ణాటక సంగీతాన్ని అభిమానించే వారికి, విజయనగరం ఒక పుణ్యక్షేత్రం లాంటిది. అక్కడి మహారాజా కళాశాల, గుడికంటే ఎక్కువ. నారాయణదాసుగారు మొదలు శ్రీరంగం గోపాలరత్నం గారి వరకు అక్కడ పనిచేసిన ప్రిన్సిపల్స్ పట్టిక చూస్తే ఆశ్చర్యం కలిగింది. మొదటిరోజు వెడితే గుడి తలుపులు మూసి ఉన్నాయి. మరునాడు ఉదయమే మళ్లీ వెళ్లాము. ఆ మెట్లమీద కాలుపెట్టడానికి మనసొప్పలేదు. నమస్కరించి లోనికి పోయాము. పూర్వ వైభవం లేదన్న సంగతి తెలిసిపోతున్నది. అక్కడక్కడ విద్యార్థులు చెట్లకింద అభ్యాసం చేసుకుంటున్నారు. ఆవరణలో, భవనం వెనకవైపు ఒక పెద్ద చెట్టు ఉంది. అది కాలేజీ అంతగానూ పాతది. దాని కింద కూచుని అక్కడివారు, చూడవచ్చిన వారు, మహామహులెందరో పాడి ఉంటారు. వాద్యాలను పలికించి ఉంటారు. ఆ వాతావరణంలో గడిపినంత సేపు, నాకు గుండె బరువైన భావం కలిగింది. ఆవరణలోని చెట్లన్నీ ఏపుగా పెరిగి ఉన్నాయి. సంగీతంవల్లనేమో అనిపించింది. కాలేజీలో చాలాకాలంగా పనిచేస్తున్న ఒక ముసలమ్మతో మాట కలిపాను. ద్వారం దుర్గాప్రసాద్‌గారి ఇంటికి వెళ్లాలన్నాను. ఆ చోటు పేరు చెప్పి, ‘మాస్టారుగారుఅని అడగండి, ఎవరైనా చెబుతారు అన్నదామె. పాత్రికేయుడు ప్రసాద్‌గారిని తోడుగా పెట్టుకుని బయలుదేరాను. వెతకగా, వెతకగా ఇల్లు దొరికింది. కానీ తాళం వేసి ఉంది. దుర్గాప్రసాద్‌గారు ఊళ్లో లేరు. ఆ వెదుకుతున్నంత సేపు నా జేబులోంచి వినపడుతున్నది వారి వాద్యమేనని చెపితే ప్రసాద్ ఆశ్చర్యంగా, ఆనందంగా నావేపు చూచాడు. ఈలోగా నేను వెళ్లిన అసలు కార్యక్రమానికి టైమయింది. నిజానికి నన్ను పిలిచింది ఒక స్కూల్ వాళ్లు. సూర్యుడి పేరున్న ఆ బడిలో గణితం రామానుజన్ పేరున పండగ చేస్తున్నారు. పిల్లలతో, తల్లిదండ్రులతో, పంతుళ్లతో వేరువేరుగా కలగలిపి చాలా మాటలు, ఉపన్యాసాలు జరిగాయి. వాళ్లెంతో ఆదరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. మామిడి తాండ్ర, మోతీచూర్ ఇచ్చి సాగనంపారు. విజయనగరంలో ఉత్తర భారతీయులు బోలెడంత మంది ఉన్నారు గనుక మోతీచూర్ అక్కడ స్పెషాలిటీ అయిందన్నారు. ఆశ్చర్యం కలిగింది. ఆ ఊళ్లో దుస్తులు చాలా చవకగా, నాణ్యత గలవి దొరుకుతాయన్నారు. అందుకు టైమ్ లేదు. ఆసక్తి అంతకన్నా లేదు.

* ఇజీనారానికి బ్రహ్మపురమనే బరంపురం చాలా దగ్గర. నాకు బరంపురం మసాలా గుర్తుకు వచ్చింది. పాత్రికేయుడు ప్రసాద్ గట్టివాడు. ఒక ఫోన్‌కొట్టి నన్ను ఒక మార్కెట్‌లోని సందులోకి తీసుకెళ్లాడు. నేను అడిగిన పదార్థం దొరికింది. కొని తెచ్చాను. అక్కడ దాన్ని విప్పాలన్న ఆలోచన కూడా లేదు. ఇల్లు చేరిన తరువాత విప్పి రుచి చూసాను. నాకు గుర్తున్న నాణ్యత లేదు. సరికదా ఇది మరీ నాసిగా ఉంది. బరంపురం కేతకీ మసాలాలో, తాంబూలంలో తినదగ్గ సుగంధ ద్రవ్యాలన్నీ ఉండాలి. ఉండేవి. నామమాత్రంగా ఉన్నాయిప్పుడు. నిజం చెప్పకపోతే తప్పు! అందులో పొగాకు కూడా ఉండాలి. ఉండేది. ఉంది! నాసిగా!

Sunday, October 6, 2013

సంగీతప్రియ - రసికప్రియ

మాటను సాగదీసి, పాటగా మార్చిన మొదటి మనుషులెవరో గానీ, వారి ఈ ప్రపంచం మొత్తం రుణపడి ఉంది. పాటలేని ప్రపంచం చాలా బోసిగా ఉంటుంది కదూ!

* శిశువులకు, పశువులకు, పాములకు గూడా సంగీతం తెలుసును, అని అర్థం వచ్చే మాట ఒకటి మనవాళ్లు .చెపుతారు. కానీ అది నిజం కాదు. పాములకు చెవులుండవు. వాటికి పాట వినేంత వినికిడి లేనే లేదు.

***
(సంగీతప్రియ అవార్డు అందుకుంటూ నేను)

*
కర్ణాటక సంగీతమనే చీమ కుట్టింది. సంగీతమంటే, ఇదే సంగీతం మిగతాదంతా కాదు అన్న భావం బాగా గట్టిబడింది. మొదట్లో శాస్ర్తియ సంగీతం వినాలంటే రేడియో ఒక్కటే దిక్కు. చిన్నప్పటినుంచీ, ఇంట్లో రేడియో, ట్రాన్సిస్టర్ రూపంలో ఉంది గనుక సరిపోయింది. చదువు పేరున ఇల్లు విడిచి దేశం మీద పడినప్పుడు మొదట్లో రేడియో లేదు. సంగీతం అంతకన్నా లేదు. వరంగల్‌లో ఎం.ఎస్సీ చదువుతున్నప్పుడు అక్కడ, సంగీత కచేరీలు జరిగేవేమో తెలియదు. అక్కడి మెడికల్ కాలేజీలో రేడియోసంగీత్ సమ్మేళన్లో భాగంగా, శంకర్, సుబ్రమణ్యం, వైద్యనాథన్ సోదరుల వయొలిన్ త్రయం కచేరీ జరిగింది. ఆ సంగతి తెలిసి నేను వెళ్లాను. అక్కడ జరిగిన రెండవది గాత్ర కచేరీ, ఎవరిదో గుర్తులేదు. సోదరత్రయానికి మృదంగం మీద సహకరించినది పాలఘాట్ మణి అయ్యర్ గారని గుర్తుకువస్తే, ఒళ్లు జలదరిస్తుంది. ఆయనను నేను మళ్లీ చూడలేదు. ఆ అపర నందీశ్వరుడు కనిపించినపుడు, ఆయన గురించి నాకు అంతగా తెలియదు. వరంగల్‌లోనే భద్రకాళి గుడిలో ఎం.ఎస్. బాలసుబ్రహ్మణ్య శర్మగారి కచేరీ విన్నాను. ఆయన తన్మయత్వంలో ఎవరినీ పట్టించుకోకుండా పాడడం చాలా బాగనిపించింది. అక్కడ జనం గోల చేస్తుంటే, ఆయన ఆపి, గట్టిగా అరిచి, మళ్లీ పాట మొదలుపెట్టారు. బాగా గుర్తుంది!

శాస్ర్తియ సంగీతం ఒకటి ఉంటుందని తెలియకుండానే చాలామంది బతుకు చాలిస్తారు. తెలిసిన వాళ్లు కూడా చాలామంది వినరు. విన్న వారికి చాలామందికి, ‘నాకిది అర్థం కాదుఅన్న భావం ఉంటుంది. తిండి తినే వారందరికీ వంట గురించి తెలుసునా? తినడం చాలదా? సంగీతం వింటే చాలదా? అది తెలిస్తే రుచి పెరుగుతుందేమో గానీ, తెలియకుండానే వింటున్నాను నేను. అయినా బాగుంది.

హైదరాబాదుకు చేరేలోపలే, ఒక మిత్రుడిచ్చిన చిన్న ట్రాన్సిస్టరు ఒకటి నాకు సంగీతాన్ని, సంతోషాన్ని పంచి పెట్టింది. నాలుగు రూకలు రావడం మొదలయింతర్వాత ఒక ట్రాన్సిస్టర్ కొన్నాను. హాస్టల్లో చాలామందికి, పాటలు వినాలన్న కోరిక ఉన్నా, రేడియో కొనాలన్న ఆలోచన మాత్రం లేదు. నేను చదివే పుస్తకాలు, మెచ్చుకునే సినిమాల కారణంగా, మిత్రులంతా కలిసి నాకు, ‘తాతయ్యఅని పేరు పెట్టారు. తాతయ్య రేడియోలో సంగీతం తప్ప, సినిమా పాటలు పలకవు, వదిలేయండిఅనేవారు.

నల్లకుంటలో ఒక గదిలో, తమ్మునితో బాటు ఉంటున్నప్పుడు, కూరలకని బయలుదేరి, టేప్‌రికార్డర్ కొని తెచ్చాను. ఇంటికి వచ్చి డబ్బులు తీసుకుపోయి ఇచ్చినట్టు గుర్తు. అప్పటికి రికార్డెడ్ కాసెట్లు అంతగా వచ్చేవి కావు. నా దగ్గర మరీ అంతగా పైసలు ఉండేవీ కావు. రేడియోలో మీడియం వేవ్‌లోనే మద్రాసు కూడా వినిపించేది. బాలమురళి కచేరీ, కాసెట్లో రికార్డ్ చేసి విన్నాను. సంగీత సేకరణకు అది ప్రారంభం. కమర్షియల్ కాసెట్లకు బోలెడు డబ్బులవుతాయి. ఖాళీది కొని ఆ కాసెట్లకు కాపీలు చేసి ఇచ్చే వాళ్లున్నారని తెలిసింది. అది అన్యాయమనీ, కళాకారుల పట్ల ద్రోహమనీ భావం ఉన్నా కొంత కాలం తప్పలేదు. కొంచెం వెసులుబాటు కలిగిన తర్వాత కాసెట్లు అసలు రికార్డింగులనే కొనడం మొదలయింది. రేడియో కచేరీలను రికార్డు చేయడం కూడా సాగింది. అప్పట్లో ఒకసారి ఎల్లా వెంకటేశ్వరరావుగారు, శంకరమఠంలో 24 గంటలపాటు మృదంగం వాయించి రికార్డు సృష్టించారు. నేను నా టేప్‌రికార్డర్‌తోబాటు వెళ్లి, కార్యక్రమంలో కొంత భాగం, ఒక గంటపాటు రికార్డు చేశాను. ఆ రికార్డింగ్‌లో నేను బంధించిన ఎన్.ఎస్.శ్రీనివాసన్, ఎల్లా గారలు తరువాత నాకు సహోద్యోగులు, మిత్రులు అవుతారని కలలో కూడా ఊహించలేదు. అంతకన్నా ఆశ్చర్యం, ఆ రికార్డింగ్‌ను ఎమ్‌పీత్రీగా మార్చి, ఇంటర్‌నెట్‌లో ప్రపంచంతో పంచుకుంటానని అసలే అనుకోలేదు.

ఎక్కడ కచేరీ జరిగినా, తిండిని కూడా మరచి వెళ్లి కూచోవటం అలవాటయింది. సీకా వాళ్లు టికెట్లు అమ్ముతున్నారంటే, వారం రోజులపాటు మంచి సంగీతం వినడానికి గొప్ప అవకాశం రవీంద్రభారతిలో జరిగే, వారి ఫెస్టివల్ టికెట్ల మీద, ఇంకా నంబర్లు వేయకముందే వెళ్లి, నాకు కావలసిన వరుసలో, చివరి సీటు నంబరు వేసుకుని, టికెట్ తెచ్చుకున్నాను. సంగీతం వినడానికి ఏకంగా మద్రాసుకే వెళ్లడం దాకా చేరింది పరిస్థితి.
ఒక్కసారి అక్కడి నుంచి, ఇటీవలి కాలంలోకి వస్తే, కంప్యూటర్ వచ్చింది. పాతకాలం, టేపులు, క్యాసెట్ల మీది రికార్డింగులను డిజిటయిజ్ చేసి వింటున్నారు. అటువంటి సంగీతాన్ని, ఇంటర్‌నెట్‌లో పంచుకుంటున్నారు. నేను ఇట్లాంటివేమీ మిస్ కాలేదని గర్వంగా చెప్పగలను. ఒక సహోద్యోగి అన్న మాట మీద పట్టింపు వచ్చి కంప్యూటర్ వాడడం నేర్చుకున్నాను. అందులో మంచి నైపుణ్యాన్ని సాధించానని చెప్పగలను. రికార్డింగులను డిజిటయిజ్ చేయడమూ నేర్చుకున్నాను. ఆ రికార్డింగులను ఇంటర్‌నెట్‌లో పంచుకోవడమూ నేర్చుకున్నాను. నా దగ్గర ఉన్న కాసెట్ రికార్డులన్నీ అయిన తరువాత, సరేలే, మనకెందుకన్నట్లు ఊరుకున్నాను. స్వర్గీయ మిత్రులు శ్రీనివాసన్ గారింట్లో ఆయన సేకంచిన కాసెట్లు ఉన్నాయి. శారదా శ్రీనివాసన్‌గారి మంచితనం వల్ల, వాటినన్నిటినీ తెచ్చి, ‘కన్వర్ట్చేయసాగాను. వాటిని నా బ్లాగుద్వారా ప్రపంచంతో పంచుకోవడమూ మొదలయింది. ఈ ప్రపంచంలో ఒకే ఆసక్తి గలవారంతా, ఒక చోట చేరడంలో ఆశ్చర్యం లేదు. ఇంటర్‌నెట్ ప్రపంచంలో అది మరింత సులభంగా వీలవుతుంది.

శ్రీనివాసన్ రాజగోపాలన్ అనే ఒక ఉత్తముడు, ఇంటర్‌నెట్‌లో సంగీతప్రియపేరున కర్ణాటక సంగీత అభిమానుల బృందాన్ని రూపొందించారు. నా ఆసక్తి, శ్రమ వాళ్ల దృష్టిలోకి వచ్చింది. నేను సేకరిస్తున్న సంగీతాన్ని, వాళ్లతో పంచుకోవలసిందిగా పిలుపునిచ్చారు. నాకు మొదట్లో అంతగా ఉత్సాహంగా ఉండలేదు. కానీ, అప్పటికే ఇంటర్‌నెట్ ద్వారా, సంగీతాన్ని పంచుకునే మిత్రులతో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. అలాంటి వారిలో కొందరు అప్పటికే సంగీతప్రియబృందంలో ఉన్నారు. బరోడాలో ఉండే, కన్నడిగులయిన మిత్రులు గురుమూర్తిగారు, నన్ను ప్రోత్సహించారు. ఈ పేరున మనకు సేకరణ మీద శ్రద్ధ పెరుగుతుంది. ధ్యాసగా సంగీతం వినడం, అవసరంగా మారుతుందిఅన్నారు. నిజం గదా!అనిపించింది. ఒక ఉద్యమం మొదలయింది. ఇవాళ ఇంట్లో వేల గంటల సంగీతం వచ్చి చేరింది. ఎక్కడెక్కడి నుంచి, మిత్రులు (కేవలం సంగీత మిత్రులు) వారి దగ్గరున్న రికార్డింగులు, టేపులు, కాసెట్ల రూపంలో పంపుతున్నారు . తిండి, పుస్తకాలతోబాటు, శాస్ర్తియ సంగీతం, బతుకులో ఒక ముఖ్యమయిన భాగమయింది.

నా గొప్ప చెప్పుకోవడానికి మరెవరూ లేనప్పుడు, అదేదో నేనే చెప్పుకోవాలట! కర్ణాటక సంగీత ప్రచారానికి సేవ చేసిన వారికి, ‘సంగీతప్రియవారు రసిక ప్రియఅని ఒక అవార్డును ప్రారంభించారు. 2011 సంవత్సరానికిగాను, ఆ బహుమతిని నాకిచ్చారు. 2012 ఫిబ్రవరిలో చెన్నైలో నాకు ఆ బహుమతిని ఇచ్చారు. ఈ సంగతి, సంగీతాభిమానులయిన కొందరికి తప్పక, చాలామందికి తెలియకపోవచ్చు! నా సంతోషం కొరకు నేనేదో చేస్తుంటే, మీరు నన్ను పిలిచి సన్మానిస్తున్నారు. అది మీ మంచితనం!అన్నట్లున్నాను ఆ సభలో!
గోపాలం, ఇలాంటి పనులు చేస్తాడని చెప్పి, రికార్డింగులు అడిగితే ఆయనకు ఏం ఇంటరెస్టు? ఏం లాభం?’ అని అడిగారట ఒక విద్వాంసులు. వినయంగా విన్నవించుకుంటున్నాను, ‘నాకు ఖర్చేగాని డబ్బు రాదు కానీ, కలిగే ఆనందాన్ని అంతుల్లేవు!

*
మన దేశంలో గ్రామఫోన్ రికార్డింగుల తయారీ 1903లో మొదలయిందంటారు. సేలం గోదావరి అనే ఆవిడ ఎంతమందికి తెలుసు? కోయంబత్తూరు తాయి రికార్డులు రేపిన సంచలనం గురించి కథలుగా చెపుతారు. విజయనగరానికి చెందిన కళాకారుడొకాయన ఆ రోజుల్లోనే ఈలపాట మీద కర్ణాటక సంగీతం వినిపించారు. పాతకాలపు రికార్డు చాలామంది ఇళ్లలో పడి ఉన్నాయి. అలాంటి వాటిని సేకరించి పాటలను అందరితో పంచుకోవాలని, నాలాంటి కొందరు తాపత్రయ పడుతున్నారు.

* తిరువయ్యారులో త్యాగరాజస్వామి వారి ఆలయం, బెంగుళూరు నాగరత్నమ్మ అనే గాయని పుణ్యమా అని కట్టబడింది. ఆమె గురించి మిత్రులు శ్రీరామ్ వెంకటకృష్ణన్, ‘దేవదాసి అండ్ ఎ సెయింట్అని పుస్తకం రాశారు. దానికి తెలుగు అనువాదం కూడా వచ్చింది. సంగీత, సాహిత్య అభిమానులందరూ తప్పక చదవవలసిన పుస్తకాలవి. తెలుగు సాహిత్యం గురించి నాగరత్నమ్మ పడిన కష్టాలు గొప్పవి!

Friday, September 27, 2013

నాకు సమ్మతమే

కొంత మంది నిత్యం రాస్తారట. నిత్యం ఆలోచనలు రావద్దూ. వాళ్లకు వస్తాయేమో. నిత్యం రాస్తే చెప్పనవసరం లేని సంగతులన్నీ ప్రపంచం ముందు ఉంచడమవుతుందేమోనని నా అనుమానం. ఒకనాడు, నేను లేనిదే ఈ ప్రపంచం ఎట్ల నడుస్తుంది అని అనుమానం వస్తుంది. కానీ క్షణం నిలబడి చూస్తే నీ గురించి పట్టించుకునే వారే లేరని అర్థమవుతుంది. ఒకనాడు అట్లా అనిపించక పోవచ్చు. ఇందాక ఒకాయన ఫోన్ చేసినడు. ఆయనకు మన వద్ద ఏదో దొరుకుతుందని నమ్మకం కలిగినట్టుంది. అందుకు వేరే వారు మరి కొందరు కారణమవుతరు. కొందరు మన మంచితనం రుచి చూచి ఉండే అవకాశం ఉందిగద. వాంఢ్లు మంచివాడులే అంటరు. ఈ కొత్త మనిషి ఆ ఆలోచనను వెంటబెట్టుకుని మన మీదికి దండయాత్ర చేస్తడు. మంచివాడులే అన్న మనిషి మనతో ఏ సందర్భంలో ఏ రకంగ మాట్లాడిందీ ఇక్కడ ప్రస్తుతం గాదు. ఆ మనిషికి మనం మంచి వాండ్లమేనన్న భావం కలిగింది. ఇవాళ మన కర్మ ఎట్లున్నదో ఆయన చూడవచ్చినడా. రాడుగద.



ఆయనకు కావలసిందేదో అడగడము చాతగావాలె. లేకుంటే అది దొరకదు. ఇంతకు ఆ వస్తువు నా దగ్గర ఉందన్న భావము ఎందుకు కలిగింది. మీ కొరకు తెగ వెతుకుతున్ననంటడు. అంత అబద్ధం. నేనేమన్న సూదినా ఎంత వెతికినా దొరకకుండ ఉండేందుకు. నన్ను చెట్టెక్కించాలె. మతలబ్ కీ దునియా అని ఒక మాట ఉన్నది. లోని అర్థము వేరని భావము. నోనెక్కడనో ఒక వ్యాసము రాసిన. రాసి ఊరుకుంటే కథే లేదు. అది పత్రికలో వచ్చింది. అందులో నేనేదో సంగతి రాసిన. అది చదివిన వారికి నా దగ్గర ఒక వస్తువు ఉన్నదన్న భావము కలుగుతుంది. వ్యాసము ఉద్దేశ్యము మాత్రము అది కాదు. మరేదో సంగతి గురించి చెప్పినా ఒక పదార్థము లేదా వస్తువు నా దగ్గర ఉందన్న భావము కలుగుతుంది.  ఆ వస్తువు కావాలనుకున్న వారంత నా మీదికి దండయాత్ర చేస్తే నేనేమవుత?

సరిగ్గ అదే జరిగింది. ఆ వస్తువు నా దగ్గర ఉన్నదా లేదా అన్నది ప్రశ్నే కాదు. ఒక పక్షాన ఉంటే అది నేను ఎంత మందికి ఇవ్వగలుగుతానన్నది ఇంకొక సంగతి.

మొత్తానికి నాగురించి పట్టించుకున్న వారు ఉన్నరని రుజువయింది. అయ్యా, దాని వలన ఎవరికి ఎంత ప్రయోజనము కలిగింది. అది ప్రశ్న.

నిత్యం రచనలు చెస్తుంటే ఇట్ల పిండి పిసికే సంగతులు తప్ప మతలబు గల మాటలు రావు. ఇంక ఆలోచనలను పంచుకోవడమని మరొక పద్ధతి ఉన్నది. అంటే రాయనవసరము లేకుండ, అంత దూరము పోకుండనే మాటలతోటి మందిని మప్పగించడము ఇక్కడ జరుగుతుంది. ఎప్పటికి మప్పగించడమే కాకపోవచ్చు. అప్పుడో ఇప్పుడో మంచి మాట రాక పోదు. ఎవ్వరు గూడ ఎప్పటికి మంచి మాటలనే చెప్పజాలరు. సైన్సులో ఏ విషయమయినా అండర్ ద గివన్ కండిషన్స్ మాత్రమే సత్యము. ఒక పరిస్థతిలో మాత్రమే అవి సత్యము. ఒకటి కూడ కాదు. కొన్ని పరిస్థతులు. తరువాత మరొకరు వచ్చి ఇది సత్యము కాదు, అని నిరూపించే వరకు మాత్రమే ఏదయినా సత్యము. మాటలు కూడ ఎటువంటి పరిస్థతిలో పలుకబడినవి అన్న ప్రశ్న పుడుతుంది గద. గొప్పవారు చెప్పినవన్ని గొప్ప మాటలేనా. అప్పుడప్పుడు వారు కూడ అనుమానాస్పదమయిన వంగతులు చెప్పే వీలు ఉన్నదిగద. అందుకు కొన్ని కారణములు టయి. వారొక మాటను ఒక సందర్భములో చెప్పి ఉంటరు. అది ఆ సందర్భములో సత్యమే. కాని సందర్భమును పక్కనబెట్టి మాటను మాత్రమే మనము ఉదహరించినప్పుడు దానికి వేరే అర్థములు తోచే ప్రమాదము ఉన్నది.

నిత్యము రాసే వారి మాటలు, గొప్పవారనిపించుకున్న వారి మాటలను కూడ తర్కించి గాని అంగీకరించ గూడదని తాత్పర్యము.

ఆలోచించండి. అవుననిపించినా కాదనిపించినా నాకు సమ్మతమే.

ఆ సంగతి మీరు కడుపులో దాచుకుంటే మాత్రము మాకు ఏ సంగతీ తెలియదు. అవునా, ఆలోచించండి.

Tuesday, July 3, 2012

మనలో ఎవరు బెస్ట్?

'ఎలాగున్నారు?’ అని ఎవరినయినా ఒక ప్రశ్న అడిగి చూడండి. ‘ఆఁ! ఏదో! బాగానే ఉన్నాం!’ అంటారు గానీ, ఎవరూ సంతోషంగా ఉన్నామని చెప్పరు. కానీ, వ్యాపారాలు చేసే సంస్థల్లో మాత్రం బెస్ట్, గ్రేట్ లాంటి మాటలు ఊరికే వినపడుతుంటాయి. ఏదో ఒక పరికరం, అందులోని భాగం గురించి వ్యాపార పరంగా చర్చ జరుగుతూ ఉంటుంది. అందులో ‘మీరు ఇవ్వగల బెస్ట్ ప్రైస్ (ధర) చెప్పండి!’ అని ఒక డయలాగ్ ఉంటుంది. ఆ ధర కొనేవారికి తక్కువగానూ, అమ్మేవారికి లాభకరంగానూ ఉండాలి. అక్కడ బెస్ట్ అంటే అన్నింటికన్నా మంచి అనే అర్థం! అదే మరి మనుషులు, ఉద్యోగులు, వారి పని గురించి మాట్లాడుతుంటే మాత్రం ఈ మాటల అర్థాలు మారిపోతాయి. అవి ఒక్కొక్కరికి ఒక రకంగా అర్థమవుతాయి. అక్కడే సమస్యలు మొదలవుతాయి.
మనతో బాటు, మరెందరో పనిచేస్తుంటారు. అందరిలోనూ కలిసి బెస్ట్ ఎవరని వెతకవలసిన అవసరం వస్తుంది. అక్కడ అభిప్రాయాలలో చాలా తేడా కనబడుతుంది. మీరుండేస్థాయిని బట్టి పని నాణ్యత, వ్యక్తుల క్లాసు గురించిన అవగాహన మారుతుంది. ఆఫీసులో ఏదో ఒక పని చేయవలసిన అవసరం వస్తుంది. ‘దీనికి ఎవరు బెస్ట్?’ అని ప్రశ్న మొదలవుతుంది. తగినవారు ఎవరైనా ఉన్నారా, అనే ప్రశ్న కూడా పుడుతుంది. ఉన్నవాళ్లంతా మంచివాళ్ళే. కానీ, కొత్త అవసరం వచ్చేదాకా దానికి సరిపడే వారు ఉన్నారా? అన్న సంగతి తెలియదు!


‘నీవు కోరిందేదో నీ దగ్గర ఉందన్న సంగతి, ఆ కోరిందేదో తెలిసేదాకా తెలియదు’ అని ఒక మాట ఉంది. మనుషులయినా అంతే! ఆఫీసులో, కంపెనీలో ‘బెస్ట్’ గురించిన వెదుకులాట చాలా రకాలుగా ఉంటుంది. మనుషుల గురించయితే, అందుకు కొన్ని పద్ధతులున్నాయి. అందరికీ తెలిసిన ‘పనె్నండు ప్రశ్నల పరీక్ష’ ఒకటి ఉంది. అది కాపీ రైటు కింద వస్తుంది. ఉద్యోగి భావాలను గుర్తించే ప్రయత్నంలో మామూలుగా కొన్ని ప్రశ్నలుంటాయి.


* కంపెనీ నమ్మే విలువలనే ఇంచుమించుగా నేను కూడా నమ్ముతాను.
* నేను, నా కంపెనీ భవిష్యత్తు బాగుంటుందనుకునేవారిలో ఒకడిని.
* కంపెనీ గమ్యాలను చేరడంలో, నా పాత్ర ఏమిటో నాకు బాగా అర్థమయింది-లాంటి కొన్ని పడికట్టు భావాల గురించి సర్వే చేస్తుంటారు. కానీ, ఈ రకం ప్రశ్నలు అన్ని సందర్భాలలో, అన్ని డిపార్టుమెంట్లలో సంతృప్తికరమయిన ఫలితాలను ఇవ్వవు. మరింత సూటిగా, ఒక్కొక్క ఉద్యోగికి చేతనయిన పనులు, పనులు చేయడంలోనూ, కంపెనీ పట్ల వారు చూపించే విధేయత మొదలయినవి మరీ లోతుగా చూడవలసిన అవసరం వస్తుంది. అట్లా, ప్రశ్నల సంఖ్య ఎక్కువవుతుంది. సర్వే, చాలా చికాకు అవుతుంది. ఒకానొక కంపెనీ వారు సర్వే కోసం నాలుగు వందల ప్రశ్నలు సిద్ధం చేశారు. ఇక ఆ సర్వేలోనుంచి, అనుకున్న ఫలితాలు రావని వేరుగా చెప్పనవసరం లేదు.


మీరు ఎంతగా ‘బెస్ట్’కు దగ్గరవుతున్నారన్న సంగతి ముందు మీకు తెలుస్తుంది. కానీ, మీ చేత పని చేయిస్తున్న వారి ఎక్స్‌పెక్టేషన్స్ మరోరకంగా ఉంటాయి. మీ సూపర్‌వైజర్, ‘కానీ’ అని ఒక పుల్ల వేస్తాడు. మీది మేనేజర్ అగ్గిపుల్ల గీచి ఈ పుల్లను వెలిగిస్తాడు. కనుక ఎవరు బెస్ట్ అన్న ప్రశ్నకు జవాబు, ఉద్యోగుల మధ్య నుంచి రాదు. మేనేజర్ల నుంచి వస్తుంది. మేనేజర్లకు తమ సిబ్బందితో ఉండే మంచి సంబంధాల ఆధారంగా నిర్ణయం వస్తుంది. మనం మనుషులం. మేనేజర్లు కూడా మనలాగే మనుషులు. కనుక, కొన్ని సందర్భాలలో నిజమయిన ‘బెస్ట్’ బయటపడకుండా, నిరాశకు లోనవుతారు. అదనంగా పని చెప్పడానికి, బెస్ట్ గురించి వెతికితే మాత్రం, అక్కడి ప్రశ్నలు మరోరకంగా ఉంటాయి. పనిని బెస్ట్‌గా చేయగలిగిన వారికన్నా, బెస్ట్‌గా మాట వినేవారికి భారం అప్పగించే వీలు ఎక్కువ. అందులో అందరికీ సులువుంది. ఉద్యోగులలో నిజంగా బెస్ట్ ఎవరన్నది, చిక్కు ప్రశ్న. ఒక్కొక్క విషయానికి, సందర్భానికి ఒకరు బెస్ట్‌గా ఉంటారు. కొంతమందిలోని మంచీ చెడు లక్షణాలను మేనేజర్లు గమనించరు. ఒక పెయింటింగ్ ఉంటుంది. అందులో అక్కడక్కడ ఖాళీలు ఉంటాయి. ఆ ఖాళీలలో కూడా రంగులు పులిమితే, పెయింటింగ్ అందం, ఆకర్షణ తగ్గుతాయి. ఒక పూల గుత్తిలో, ఒక పువ్వు తగ్గినా, ఎక్కువయినా దాని రూపం మారుతుంది. బాపు బొమ్మలో ఒక గీత తగ్గినా ఆ బొమ్మ అసంపూర్తి అవుతుంది అంటారు. మనుషుల వ్యక్తిత్వాలు కూడా అలాంటివే. 



మనమయినా, మన మేనేజర్లయినా, వ్యక్తిత్వంలోని ఖాళీలను అదనపు లక్షణాలను ఈరకంగా గుర్తించగలగాలి. మన దృష్టిలో కొన్ని లక్షణాలు మాత్రమే వచ్చి, మిగతావి రాకుంటే, ఆ వ్యక్తి మనమే అయినా సరే, చిత్రం అసంతృప్తి అవుతుంది. కొంపలు మునుగుతున్నా సరే, నిత్యం ఆఫీసుకు సమయానికి వచ్చేవారు మంచి ఉద్యోగులా? చెప్పిన పనిని నిజంగా ధ్యాస పెట్టి ముగించేవారా? కంపెనీ, సంస్థ గమ్యాల గురించి అవగాహన ఉండి, అందుకు తమ వంతు కృషి చేసేవారిని ఏమనాలి? పని చేసినా, చేయకున్నా, సరైన సమయంలో మంచి సలహాలు, అభిప్రాయాలు, ఆలోచనలు అందజేసేవారుంటారు. వారినేమనాలి? కొందరికి సమస్యలను విడదీయడంలోని మెళకువలు తెలిసి ఉంటాయి. కొందరు పని సాధించడంలో పట్టుదలగలవారుంటారు. ఈ లక్షణాలు అన్నీ ఒకరిలో దొరకవు. కొంతమందిలో ఈ లక్షణాలే కనిపించవు. అన్ని మంచి గుణాలే, కానీ, జాగ్రత్తగా గమనిస్తే, మంచి గుణాలు రెండింటి మధ్యన వైరుధ్యం కనబడుతుంది. ఒక్కొక్క గుణం గురించి ఆలోచించినా, వాటిలో మంచితో బాటు కొంచెం చెడు కూడా కనిపించే వీలుంది. ఎవరికివారికే ఈ అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయి. మొత్తంమీద ఎవరి అభిప్రాయం కూడా పూర్తిగా తప్పుకాదు, పూర్తిగా సరయింది కాదని గుర్తుంచుకుంటే బాగుంటుంది. సందర్భాన్ని బట్టి, మనుషుల విలువ తెలుస్తుంది. ‘తగినవారు’ ఉంటారు. ఆ సమయానికి వారే బెస్ట్! మొత్తంమీద ఎవరి అభిప్రాయం కూడా పూర్తిగా తప్పుకాదు, పూర్తిగా సరయింది కాదని గుర్తుంచుకుంటే బాగుంటుంది.

సందర్భాన్ని బట్టి మనుషుల విలువ తెలుస్తుంది. ‘తగినవారు’ ఉంటారు. ఆ సమయానికి వారే బెస్ట్! మొత్తంమీద బెస్ట్ అనే వారుండరు!


ఇంతా జరిగిన తరువాత, మేనేజర్ల మీద కూడా బాసులుంటారు. వారి అభిప్రాయాలను కాదనగలిగే శక్తి, తక్కువగా ఉంటుంది. అందరిమధ్యన జరిగిన నిర్ణయాలను, అక్కడ, అవుననిపించుకుంటే, అనిపించగలిగితే, ఆ సందర్భంలో ఆ మేనేజర్ బెస్ట్! అవునన్న పెద్ద బాసు బెస్ట్! ఆ బాసు మేనేజర్‌ని బెస్ట్ అంటారు. మేనేజరు మనందరినీ బెస్ట్ అంటారు! అప్పుడు మాటకు అర్థం ఉంటుంది!




నాకు నచ్చని సంగతులు!




టైమెంత అని అడగటానికి చేతిని చూపించడం! నా గడియారం ఎక్కడుందో నాకు తెలుసు? గడియారం లేనిది నీకు గదా? బాత్‌రూం ఎక్కడ అని అడగడానికి ఏం చూపిస్తావ్? (సారీ)

సినిమా చూస్తున్నాము. ‘చూశావా? చూశావా? అంటాడు పక్కతను! బోలెడు డబ్బు పెట్టి సినిమాకు వచ్చింది, చూడటానికి కాకపోతే, గోళ్లుగిల్లుకోవడానికా?

నిన్నొక ప్రశ్న అడగనా?’ అనే ప్రశ్న! అప్పుడే ఒక ప్రశ్న అడిగావు. మరోకటి ఎలాగూ అడుతావిక!

‘జీవితం చిన్నది’ అనే మాట! ఏమిటర్థం? మనకు చేతయిన పెద్ద సంగతి అదొకటే! దానికంటే ఎక్కువ కాలం మరేమి సాధించగలం గనుక?

సందర్భం!
అదొక నగరం. అక్కడొక కుటుంబం. కుటుంబమే, కానీ ఉండేది ఇద్దరే! ఒక తల్లీ, ఒక కూతురు. మరో దిక్కులేని వారయినా, వారుకూడా కుటుంబమే. సుఖంగా బ్రతుకుతున్నారు. ఒకరిమీద ఒకరికి ప్రేమ కూడా బోలెడుంది. కానీ, వాళ్లిద్దరికీ నిద్రలో నడిచే అలవాటు ఉంది. అదొక పెద్ద సమస్యలా కనిపించలేదు వారికి. ఒకరు లేస్తే మరొకరికి మెలుకవవుతుంది. ఎలాగో సర్దుకుంటున్నారు.

ఒకానొక రాత్రి, ప్రపంచమంతా నిశ్శబ్దంగా నిద్రలో ఉంది. తల్లీ కూతుళ్లిద్దరూ ఒకేసారి, నిద్రలో నడక మొదలుపెట్టారు. ఇద్దరికీ మెలుకువ రాలేదు. నడుస్తూ, నడుస్తూ రాళ్ల తోటలోకి చేరుకున్నారు. అక్కడ పొగ మంచు నిండి ఉంది. ఇద్దరూ ఒకరొకరికి ఎదురుపడ్డారు.

‘‘ఆహా! రాక్షసీ! చివరికి ఎదురయ్యావా? నీ వల్లే గదా నా బతుకంతా నాశనమయింది, ఆ శిథిలాల మీద నీవు నీ బతుకు బంగళా కట్టుకున్నావు! నిన్ను చంపగలిగితే బాగుండును!’ అన్నది తల్లి ఆవేశంగా!

‘‘నువ్వొక ఆడదానివా? ఆశపోతు ముసలిపీనుగా! నా బతుకుకూ నాకూ మధ్య అడ్డుగోడగా నిలబడ్డావు! నాబతుకు కూడా నీ బతుకులాగా తెల్లవారుతుంటే, నేనూరుకుంటానా? నువ్వు చస్తే, నా పీడ విరుగడవుతుంది!’’ అన్నది కూతురు.
అంతలో కోడి కూసింది. తల్లికీ, కూతురికీ మెలుకువ వచ్చింది.

‘నువ్వేమిటి బంగారు తల్లీ! ఇక్కడున్నావు?’ అంది తల్లి. ‘నీవేమిటమ్మా ఇక్కడ?’ అంది కూతురు. ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్లారు.

-ఖలిల్ జిబ్రాన్ ఆధారంగా!

అసలు మాట
నోరు విప్పకుండా ఉంటే, చవటలమని ఎలాగూ అర్థమవుతుంది! నోరు విప్పి, ఇక సందేహం లేకుండా చేయడమెందుకు?
-రామీ బెల్సన్

ఏదో ఎగురుతూ వస్తున్నది. ఏమిటా అని చూస్తున్నాను. అదొక రాయి. అది నాకే తగిలింది!