Saturday, May 12, 2012

పొలోనియం


మేరీ క్యూరీ 1898లో పొలోనియం అనే మూలకాన్ని కనుగొన్నందుకు వందేళ్ళ క్రితం ఆమెకు నోబేల్ బహుమతినిచ్చారు. ఆమె స్వంత దేశం పోలాండ్. ఆ దేశం పేరునే మూలకానికి పెట్టిందామె. కానీ, అప్పటికి పోలాండ్ స్వతంత్ర దేశం కాదు. భూమి పైపొరల్లో ఈ మూలకం చాలా తక్కువగా దొరుకుతుంది. ఈ మూలకం గురించి ఆసక్తికరమైన సంగతులు కొన్ని...

* 1944
కు ముందు పొలోనియంను ప్రత్యేకంగా శుద్ధిచేసి తయారుచేసింది లేదు. మన్‌హటన్ ప్రాజెక్ట్‌తో పరిస్థితి మారింది. పొలోనియం గురించి ఆల్ఫా పార్టికల్స్ వెదజల్లబడుతుంటాయి. బెరీలియం అనే మరో మూలకం ఈ కణాలను పీల్చుకుని న్యూట్రాన్స్‌ను వదులుతుంది. మొట్టమొదటి అణుబాంబును పేల్చడానికి ఈ రెండు రసాయనాలను వాడుకున్నారు. చివరి క్షణం వరకు రెంటినీ విడివిడిగా ఉంచారు. వాటిని కలిసిన మరుక్షణం పేలాయి!

*మన చుట్టూ ఉండే గాలిలో పొలోనియం- 210 ఉంటుంది. రేడాన్-222 అనే వాయువు నుంచి కణాలు తొలగినందుకు ఇది పుడుతుంది. భాస్వరం పుడుతున్నపుడుకూడా పొలోనియం పుడుతుంది. మొక్కలు తమ వేళ్ల ద్వారా పొలోనియంను పీల్చుకోగలుగుతాయి. లేక అది నేరుగా పెద్ద వెడల్పయిన ఆకుల ద్వారా కూడా మొక్కలలోకి చేరగలుగుతుంది. లైకెన్స్‌జాతి మొక్కలు పొలోనియంను నేరుగా గాలినుంచి పీల్చుకుంటాయి. రెయిన్‌డియర్లు, లైకెన్స్‌ను తింటాయి. రెయిన్‌డియర్‌లను తినే మనుషుల శరీరంలో పొలోనియం ఎక్కువగా ఉంటుంది.

*సిగరెట్లు మిగతా పొగాకు పదార్థాలలో రేడియో ఆక్టివ్ పొలోనియం చాలా తక్కువ మోతాదుల్లో ఉంటుంది. 1959లోనే పొగాకు కంపెనీలవారికి ఈ సంగతి తెలుసని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారి అభిప్రాయం. ఈ పొలోనియం కారణంగా పొగ తాగే వెయ్యిమందిలో 138 మంది మరణిస్తున్నారు. గడచిన 25 సంవత్సరాలుగా ఈ చావులు సాగుతూనే ఉన్నాయి.

*పొలోనియం నుంచి వచ్చే ఆల్ఫా కణాలు చర్మం పైపొరలోకి దూసుకుపోజాలవు. కనుక బయటనుంచి దీనివల్ల ప్రమాదంలేదు. పొలోనియంను మింగితే, అందులో సగం నుంచి 90 శాతందాకా మలంలో బయటకు పోతుంది. మిగతాది మూత్రపిండాలు, లివర్, స్ప్లీన్‌లలో చేరుకుంటుంది. రేడియో ఆక్టివ్ రసాయనం గనుక దాని మోతాదు 50 రోజుల్లో సగమయిపోతుంది. ఊపిరితిత్తులలోనికి పొలోనియం చేరితే ప్రభావం అక్కడ మాత్రమే కనబడుతుంది. పొగతాగేవారిలో పొలోనియం రెండింతలు ఎక్కువగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

*పొలోనియం కారణంగా చనిపోయిన మొదటి వ్యక్తి బహుశ మేరీ క్యూరీ కుమార్తె జోలియట్ క్యూరీ. 1946లో జోలియట్ పరిశోధనశాలలో ఉండగా పొలోనియం క్యాప్యూల్ ఒకటి పేలింది. 10 సంవత్సరాల తర్వాత క్యాన్సర్ కారణంగా జోలియట్ మరణించింది. అందుకు కారణం పొలోనియం కాలుష్యమేనని అంటారు.

*పొలోనియంను వాడి గూఢచారులను చంపిన సంఘటన ఇంగ్లండ్‌లో జరిగింది.

No comments:

Post a Comment