Friday, January 20, 2012

ఏకాదశి తాంబూలం - తాతాచార్ల కథ



వక బ్రాహ్మణుడు వక అగ్రహారములో ఏకాదశి నాడు తాంబూలం వేసుకుంటూ ఉండెను.
యింక వక బ్రాహ్మణుడు చూచి అయ్యో వోయి బ్రాహ్మణుడా తెలిసినవాడ వైయ్యుండిన్నిఏకాదశినాడు ప్రొద్దుననే
యిట్లా తాంబూలం వేసుకోవడం యుక్తమేనా అని అడుగగా వుల్లిగడ్డల కంపు పోవద్దా అని చెప్పెను.
అయ్యయ్యో ఉల్లిగడ్డలు కూడా తింటివా అని అడిగెను.
పుల్లని చద్ది అన్నములోకి వుల్లిగడ్డలు కొరుక్కోకపోతే సయిస్తున్నదా అని చెప్పెను.
అయ్యయ్యో నేటిదినం ఉపవాసం వుండగా చల్ది అన్నము కూడ తింటివా అని అడిగెను.
చల్ది అన్నము తినకపోతే మేహకారకం అణుగునా అని చెప్పెను.
ఆహా మేహకారకపు రోగము కూడానా అని చెప్పెను.


ఇందున గురించిన శ్లోకం


భిక్షో మాంస నిషేవణం కిముచితం
కింతేన మద్యం వినా
మద్యంయంచాపి తవ ప్రియం
ప్రియమహో వారాంగనాభిస్సహ
వారస్త్రీ రతయే కుతస్తవ ధనం
ద్యూతేన చౌర్యేణవా
చౌర్య ద్యూత పరిశ్రమోపి భవతాం
భ్రష్టస్య కావా గతిః


(ఓ సన్యాసీ మాంసం తినడం తగునా
మద్యపానమన్న తర్వాత మాంసం లేక రుచించదుగదా
మద్యం కూడా తమకు ఇష్టమా మహాశయా
ఇష్టమా యమ ఇష్టం. వారాంగనలంటే కూడానయ్యా
వేశ్యవాటికలకు వెళ్లడానికి మరి తమకు డబ్బో
జూదం లేకుంటే దొంగతనం.
తమకు చౌర్య ద్యూత ప్రావీణ్యం కూడానా స్వామీ
భ్రష్టుడయిన వాడికి మరి బ్రతుకుదెరువేదయ్యా)




షోలే సినిమాలో ధర్మేంద్ర గుర్తొచ్చి ఉండవలె.

1 comment:

  1. వొక అడుగు నైతికంగా కిందికి దిగితే...... చేరేది పాతాళమే

    ReplyDelete